అక్షరటుడే, వెబ్డెస్క్: Vizianagaram Road Accident : Vizianagaram districtలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. Perapuram సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. అనంతరం అక్కడే నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Vizianagaram Road Accident : అతి వేగం..
పోలీసుల వివరాల ప్రకారం, అతివేగంగా వచ్చిన కారు ముందుగా రహదారి పక్కన నడుస్తున్న ముగ్గురు పాదచారులపైకి దూసుకెళ్లింది. అనంతరం నియంత్రణ కోల్పోయిన కొద్దిదూరంలో నిలిచివున్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో Visakhapatnamకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావుతో పాటు ముగ్గురు పాదచారులు మరణించినట్లు చెందినట్లు అధికారులు తెలిపారు.
Vizianagaram Road Accident : ఇద్దరి పరిస్థితి విషమం
ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని వెంటనే సమీప ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం Maharaja Hospitalకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ Damodar సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు.


[…] […]