అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రెండు రోజుల్లోనే ఆఫీసుల్లో రెండు సార్లు ఏసీబీ సోదాలు జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది.
రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో అవినీతి జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఏసీబీకి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయంపై సైతం ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు, బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ నేతృత్వంలో సోదాలు చేపట్టారు.
ACB Raids | గేట్లు మూసివేసి..
ఏసీబీ (ACB) అధికారులు సోమవారం ఉదయం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సిబ్బంది బయటకు వెళ్లకుండా గేట్లు మూసి వేసి తనిఖీలు చేపట్టారు. చాలా సేపు సోదాలు చేపట్టడంతో సిబ్బంది ఆందోళన చెందారు. అయితే రెండు రోజుల క్రితం కార్యాలయంలో చేపట్టిన తనిఖీల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉండటం, అలాగే రెవెన్యూ విభాగంలో అవినీతిపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో మళ్లీ సోదాలు చేశారు. భూమి రికార్డుల మార్పిడి, రిజిస్ట్రేషన్ అంశాల్లో కొందరు అధికారులు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది.
దీనిని కూడా చదవండి : Bandi Bhagirath POCSO Case | బండి భగీరథ్ కేసులో విచారణ ప్రారంభం : సీఎం రేవంత్రెడ్డి

