అక్షరటుడే, వెబ్డెస్క్ : Kharif MSP Hike | కేంద్ర ప్రభుత్వం (Central Government) రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. పలు రకాల పంటల మద్దతు ధరను పెంచింది. వానాకాలం సీజన్కు సంబంధించి 14 రకాల పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రైతులు (Farmers) తమ పంటలకు లాభదాయకమైన ధరలను పొందేలా చూడటానికి, 2026-27 మార్కెటింగ్ సీజన్కు సంబంధించిన ఖరీఫ్ పంటల MSPని ప్రభుత్వం పెంచింది. గత ఏడాదితో పోలిస్తే MSPలో అత్యధిక పెంపును పొద్దుతిరుగుడు గింజలు(క్వింటాల్కు కే,622) సిఫార్సు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో పత్తి (క్వింటాల్కు రూ.557), నైజర్ సీడ్ (క్వింటాల్కు రూ. 515), నువ్వులు (క్వింటాల్కు రూ. 500) ఉన్నాయి.
Kharif MSP Hike | ధాన్యం రైతులకు..
రాష్ట్రంలో ఎక్కువ శాతం రైతులు వరి సాగు చేస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో పత్తి, మొక్కజొన్న ఉంటాయి. ఈ సారి ధాన్యం మద్దతు ధరను కేంద్రం పెంచింది. దీంతో రైతులకు మేలు జరగనుంది. గతంలో ధాన్యం ఏ గ్రేడ్ క్వింటాల్ ధర రూ.2,389 ఉండగా.. తాజాగా రూ. 72 పెరిగింది. దీంతో క్వింటాల్కు రూ. 2,461కి చేరింది. సాధారణ ధాన్యం సైతం అంతే పెరిగి క్వింటాల్ రూ 2,441కి చేరింది. పొద్దుతిరుగుడు పంట మద్దత ధర రూ. రూ. 622 పెరగడంతో క్వింటాల్కు రూ.7,721 నుంచి రూ.8,343కి చేరింది.
Kharif MSP Hike | అత్యల్పంగా మక్కలు
హైబ్రిడ్ జొన్నల MSP రూ. 324 పెరిగి క్వింటాల్కు రూ. 4,023కి, సజ్జల MSP రూ. 125 పెరిగి క్వింటాల్కు రూ. 2,900కి చేరాయి. రాగి (చోళ్ళు) మద్ధతు ధర రూ. 319 పెరిగి క్వింటాల్కు రూ. 5,205కి చేరగా, మొక్కజొన్న అత్యల్ప పెంపు (రూ.10) నమోదైంది, దీంతో దాని ధర క్వింటాల్కు రూ. 2,410కి చేరింది. పప్పుధాన్యాల విషయానికి వస్తే, కందుల (Tur/Arhar) ధర రూ. 450 పెరిగి క్వింటాల్కు రూ. 8,450కి, మినుముల (Urad) రూ. 400 పెరిగి రూ. 8,200కి, పెసల (Moong) రూ. 12 పెరిగి క్వింటాల్కు రూ. 8,780కి చేరాయి.
ఇది కూడా చదవండి..: Gold Import Duty | పెరిగిన దిగుమతి సుంకాలు.. ఒత్తిడిలో నగల కంపెనీల షేర్లు

