అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Accident | రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటన భిక్కనూరు (Bhiknoor) మండలం బస్వాపూర్ జాతీయ రహదారిపై (Baswapur Highway) శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
RTC Bus Accident | బస్వాపూర్ జాతీయ రహదారిపై..
పోలీసుల కథనం ప్రకారం.. బస్వాపూర్ జాతీయ రహదారిపై మహారాష్ట్రకు (Maharashtra) చెందిన డీసీఎం వ్యాన్ ఆగి ఉంది. తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆదిలాబాద్(adilabad) నుంచి హైదరాబాద్(Hyderabad) వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ను వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు ఎడమవైపు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. గాడ నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: RBI Dividend Transfer| ఆర్థిక రికార్డులు బద్దలు..కేంద్ర ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్లు ఇవ్వనున్న ఆర్బీఐ


