అక్షరటుడే, వెబ్డెస్క్: Assembly Election Counting | దేశ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం కలిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తాజాగా ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో కౌంటింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది. కాగా, పేరంబదూర్లో విజయ్ ముందంజలో ఉన్నారు.
Assembly Election Counting | కౌంటింగ్ కేంద్రాల్లో
ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. బెంగాల్లో 77 కేంద్రాలు, తమిళనాడులో 62, అస్సాంలో 40, కేరళలో 43, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం ప్రారంభించి, తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) ఓట్లను లెక్కించనున్నారు.
Assembly Election Counting | పారదర్శకంగా లెక్కింపు
భద్రతా మార్గదర్శకాలను అమలు చేస్తూ అధికారులు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి కేంద్రంలో భద్రతా సిబ్బందిని మోహరించి, అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు చేపడుతున్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు సంబంధిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయగా.. ప్రతిపక్షాలు సత్తా చాటేందుకు చూస్తున్నాయి.
five states counting | నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం


[…] ఇది కూడా చదవండి..: Assembly Election Counting | ఎన్నికల కౌంటింగ్ ప్రారంభ… […]