అక్షరటుడే, కామారెడ్డి: ATM Card Fraud | ఏటీఎం పిన్ సెట్ చేయడం తెలియక అపరిచిత వ్యక్తిని సాయం అడిగితే.. ఇదే అదనుగా అకౌంట్ ఖాళీ చేసేశాడు. ఈ ఘటన మాచారెడ్డి మండలం (Machareddy Mandal)లో బుధవారం వెలుగులోకి వచ్చింది.
ATM Card Fraud | మండలంలోచి లచ్చాపేట్..
మాచారెడ్డి ఎస్సై అనిల్ (SI anil) తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లచ్చాపేట్ గ్రామానికి చెందిన రైతు ఎర్రోళ్ల నర్సింలు (53)కు మాచారెడ్డి ఎక్స్-రోడ్ ఎస్బీఐ బ్రాంచ్లో ఖాతా ఉంది. కొత్త ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేయగా గత నెల 26న పోస్టులో కార్డు వచ్చింది. 27న పిన్ సెట్ చేసుకోవడానికి బ్యాంకు పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం (SBI ATM)కు వెళ్లారు. పిన్ సెట్ చేయడం రాక అక్కడున్న అపరిచితుడి సాయం కోరి కార్డు ఇచ్చారు. ఆ వ్యక్తి పిన్ సెట్ చేసి కార్డు తిరిగి ఇచ్చాడు. బుధవారం డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్తే ఖాతాలో బ్యాలెన్స్ లేదని తెలిసింది.
ATM Card Fraud | స్టేట్మెంట్ తీస్తే…
స్టేట్మెంట్ తీయగా గత నెల 27న ఎల్లారెడ్డిపేట ఎస్బీఐ ఏటీఎంలో రూ.10 వేలు చొప్పున 4 సార్లు మొత్తం రూ.40 వేలు, 28న కూకట్పల్లి టెంపుల్ బ్రాంచ్ ఏటీఎంలో రూ.9వేలు డ్రా అయినట్లు గుర్తించారు. మొత్తం రూ.49వేలు మోసపూరితంగా డ్రా కాగా డబ్బులు డ్రా అయినట్లు ఎలాంటి మెసేజ్ రాలేదని, అందుకే బ్యాంకుకు వెళ్లే వరకు మోసం గురించి తెలియలేదని బాధితుడు వాపోయాడు. ఏటీఎం కార్డు మార్చి మోసం చేసిన అపరిచిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ఇది కూడా చదవండి..: Police Obstruction Jail | పోలీసుల విధులకు ఆటంకం.. నిందితుడికి రెండేళ్ల జైలు