అక్షరటుడే, వెబ్డెస్క్: Balineni Comments on Jagan | వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవర్తనపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) తీవ్రంగా మండిపడ్డారు. జగన్ కేవలం బటన్లు నొక్కడానికే పరిమితమయ్యారని, ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. జగన్ తీసుకున్న మొండి నిర్ణయాల వల్లే గత ఎన్నికల్లో తాను ఓడిపోవాల్సి వచ్చిందని, తన ఓటమికి ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
Balineni Comments on Jagan | రాజధానిపై నాడే హెచ్చరించా..
రాజధాని ఏర్పాటు విషయంలో జగన్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా తాను ముందే సలహాలు ఇచ్చానని బాలినేని గుర్తుచేశారు. నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో రాజధానిని నిర్మిస్తే బాగుంటుందని ఆనాడే చెప్పినప్పటికీ.. జగన్ తన మాటను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీసుకున్న ఇష్టారాజ్య నిర్ణయాల వల్ల రాష్ట్రంతో పాటు పార్టీ కూడా భారీగా నష్టపోయిందని ఆరోపించారు.
Balineni Comments on Jagan | జగన్ వైఫల్యాల వల్లే నష్టం..
వైసీపీని సరైన దారిలో నడపడం జగన్కు చేతకావడం లేదని బాలినేని విమర్శించారు. ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ, రాష్ట్రం దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్లోని నాయకత్వ లోపాలు, ఆయన ఒంటెద్దు పోకడల కారణంగానే అటు నాయకులు, ఇటు ప్రజలు ఆయనకు దూరమయ్యారని బాలినేని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Telangana Minimum Wages | కార్మికులకు సీఎం గుడ్న్యూస్.. కనీస వేతనాలు పెంపు


