Travels Bus Accident | లారీ డ్రైవర్లపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్​ బస్సు.. ఇద్దరి మృతి

ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Travels Bus Accident | ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District) మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్లపైకి బస్సు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.

లారీ డ్రైవర్లు తమ వాహనాలను ఆపి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు, మితిమీరిన వేగంతో వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా.. పోలీసులు, హైవే సిబ్బంది రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేశారు

Travels Bus Accident | బాలికపైకి దూసుకెళ్లిన ఆటో

హైదరాబాద్​ నగరంలోని హైదర్‌షాకోట్ యాదవ్ భవన్ హోటల్ సమీపంలో ఓ బాలికను ఆటో ఢీకొంది. ఇల్లు దాటి బయటకు వస్తున్న శ్రీహరిక(11) అనే బాలికను వేగంగా వచ్చిన ఒక ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటో డ్రైవర్ అర్బాజ్‌ను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..: కుప్పంలో సరికొత్త ఈవీ ప్లాంట్ గ్రీన్ సిటీ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వంతో ఈమోటరాడ్ ఒప్పందం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *