నిజామాబాద్Kamareddy Farmers Protest | గంజాయి సాగుకు అనుమతివ్వండి.. సహనం కోల్పోయి డిమాండ్​ చేసిన రైతులు

Kamareddy Farmers Protest | గంజాయి సాగుకు అనుమతివ్వండి.. సహనం కోల్పోయి డిమాండ్​ చేసిన రైతులు

అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యం కూడా తరలించకపోవడంతో నిరసన తెలుపుతున్నారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Farmers Protest | అధికారుల తీరుపై రైతులు (Farmers) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యం కూడా తరలించకపోవడంపై ఆందోళన బాట పడుతున్నారు. ధాన్యం విక్రయాలతో ఇబ్బందులవుతున్నాయని.. తమకు గంజాయి సాగుకు అనుమతివ్వాలని రైతులు డిమాండ్​ చేశారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని అడ్లూర్ ఎస్సీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది.

Kamareddy Farmers Protest | ఆవేదనతో..

ధాన్యం కొనడంలో అధికారులు విఫలం అవుతున్నారని, నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూసే ఓపిక నశిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని గంజాయి పంట పండించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరడం అధికారులను అవాక్కయ్యేలా చేసింది. రైతుల నోట గంజాయి పండించడానికి అనుమతి ఇవ్వాలని మాట రావడం వెనక రైతు ఆవేదన స్పష్టమవుతోంది. అయితే ఈ మాటతో అధికారులు నోరెళ్లబెట్టారు. అడ్లూర్​లోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నెల రోజుల నుంచి ధాన్యం కుప్పలు తరలించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేయడానికి నిర్ణయించారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ ఇతర అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని రైతులు ఆందోళనకు వెళ్లకుండా ఆపగలిగారు.

Kamareddy Farmers Protest | నెలరోజులుగా సెంటర్​లోనే ధాన్యం

సివిల్ సప్లయ్​ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దళారులను నమ్మవద్దని అధికారులే చెప్తారని.. తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే నెలలుగా కేంద్రంలోనే వడ్లు డంప్​ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇటు కేంద్రాల్లో.. అటు రైస్​మిల్లుల్లో దోచుకుంటున్నారని ఆగ్రహించారు. ధాన్యం రైస్ మిల్లులకు పంపించడం మీ వల్ల కాకపోతే గంజాయి అయినా సాగు చేసుకుంటాం. వచ్చే యాసంగిలో గంజాయి పండించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు ఏ బాధ ఉండదు’ అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. దాంతో అధికారులు తెల్లముఖం వేశారు. కాంటా చేసిన ధాన్యం రైస్ మిల్లుకు వెళ్తే ఔటాన్ పేరిట 4 నుంచి 10 క్వింటాళ్లు కోత విధిస్తున్నారని కర్షకులు కన్నెర్ర చేశారు. ఇలా అయితే మేమెట్లా బతకాలి అంటూ నిలదీశారు. దీంతో అధికారులు స్పందిస్తూ ఇకనుంచి ఎలాంటి సమస్య రాకుండా చూస్తామని, ఎప్పటికప్పుడు ధాన్యం తరలిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.

ఇది కూడా చదవండి..: Inter Admissions | ఇంటర్​లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

FBI Scam Network|అమెరికా వృద్ధులకు భారత్ స్కామర్ల టోకరా.. గుట్టురట్టు చేసిన FBI

అక్షరటుడే వెబ్‌డెస్క్:FBI Scam Network|అమెరికాలోని వృద్ధులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయల...

Armoor Municipal Meeting | సర్వసభ్య సమావేశానికి కాంగ్రెస్​ పార్టీ కౌన్సిలర్ల డుమ్మా.. ప్రత్యేక భేటీపై సర్వత్రా చర్చ!

అక్షరటుడే,ఆర్మూర్: Armoor Municipal Meeting | ఆర్మూర్ మున్సిపల్ ఛైర్​పర్సన్ గోనె...

Tata Tiago Facelift | మధ్య తరగతి కోసం మరో కారు.. మే 28న లాంచ్ చేయనున్న టాటా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tata Tiago Facelift | దేశీయ ఆటోమొబైల్ రంగ...