అక్షరటుడే, ఎల్లారెడ్డి: BRS Councillor Resignation | ఎల్లారెడ్డి మున్సిపల్ 11వ వార్డు (లింగారెడ్డిపేట్) బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ రామగాళ్ల లక్ష్మి శివానంద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
BRS Councillor Resignation | అనేక అభివృద్ధి కార్యక్రమాలు
పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11వ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని లక్ష్మి శివానంద్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. శ్మశానవాటికకు బోరు వేయడం, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, విద్యుత్ సమస్యలను పరిష్కరించడం, హరిజనవాడలో కొత్త స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రభావితమై కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్రీకాంత్, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎల్లారెడ్డి మండలాధ్యక్షుడు కుర్మ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Biopesticides Usage | పంటలకు బయోపెస్టిసైడ్స్ వాడాలి

