అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: DFO Siddharth Vikram Singh | అడవుల సంరక్షణకు (forest conservation) ప్రజలు మద్దతివ్వాలని నిజామాబాద్ జిల్లా అటవీశాఖ (District Forest Department) అధికారిగా విక్రమ్ సిద్ధార్థ్ కోరారు. జిల్లాలో నూతన డీఎఫ్గా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠిని (Collector Ila Tripathi) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు.
DFO Siddharth Vikram Singh | అడవిలో అక్రమ కార్యకలాపాల నిరోధానికి..
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఎఫ్వో (DFO) మాట్లాడుతూ.. అడవిలో అక్రమ కార్యకలాపాల నిరోధనానికి శాఖ సిబ్బందికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. వన్యప్రాణుల సమస్యలను (wildlife protection) బాధ్యతాయుతంగా చూడాలని సూచించారు. ప్రజలకు అటవీ ఉత్పత్తులు, సంపదపై అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర కీలకమని ఆయన అన్నారు. అటవీ సంరక్షణ, మానవ-వన్యప్రాణుల సంఘర్షణ నివారణ, సుస్థిర పర్యావరణ పర్యాటక అభివృద్ధి పరంగా నిజామాబాద్ జిల్లాకు గణనీయమైన సామర్థ్యం ఉందన్నారు. అడవుల సంరక్షణకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు.
ఇది కూడా చదవండి: PM Modi | బీజేపీకి ఇది చారిత్రక రోజు : ప్రధాని మోదీ

