అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్ సింగ్ (DFO siddharth vikram singh) అన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి, మానవ-వన్యప్రాణి ఘర్షణ నివారణపై ఎన్జీవోలతో ఆయన డీఎఫ్వో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
Forest Wildlife Conservation | నందిపేట్ ప్రాంతంలో..
ఈ సందర్భంగా అటవీ, కాకతీయ సాండ్బాక్స్(Kakatiya Sandbox) సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన నందిపేట్ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలు, మానవ-వన్యప్రాణి ఘర్షణలను తగ్గించే చర్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలోని(Forest Department) ప్రకృతి సంపద, అటవీ ప్రాంతాలు, జల వనరులు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఎకో టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేసేందుకు అవకాశాలను ప్రస్తావించారు. ఇటువంటి సమగ్ర అభివృద్ధి ద్వారా నిజామాబాద్ జిల్లాను జాతీయస్థాయి పర్యాటక పటంలో ప్రముఖ స్థానంలో నిలపవచ్చని డీఎఫ్వో తెలిపారు.
Forest Wildlife Conservation | స్థానిక గ్రామీణ యువతకు ఉపాధి..
ఎకో టూరిజం(Eco tourism) అభివృద్ధి ద్వారా స్థానిక గ్రామీణ యువత, మహిళా సంఘాలు, అటవీ పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి లభిస్తుందని డీఎఫ్వో పేర్కొన్నారు. అటవీ, వన్యప్రాణి సంరక్షణకు భంగం కలగకుండా ప్రజలకు అవగాహన కల్పించడంలో అటవీశాఖ అధికారులు ముఖ్య భూమిక పోషించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Meta Layoffs | 8 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న మెటా..


