Bank Fraud Case | బ్యాంక్​ మోసం కేసులో ముగ్గురికి జైలు శిక్ష

బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు ఒక్కొక్కరికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Bank Fraud Case | బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.3.5 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు (CBI Court) తీర్పునిచ్చింది. ఢిల్లీ (Delhi) లోని సీబీఐ కోర్టు మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

అమిత్ చతుర్వేది, సంజయ్ చతుర్వేది, ప్రవీణ్ జునేజా అనే ముగ్గురు 2009లో నకిలీ పత్రాలను సమర్పించి యూకో బ్యాంక్ (UCO Bank) నుండి రూ. 7 కోట్ల టర్మ్ లోన్ పొందారు. రుణం మంజూరు చేసిన అసలు ప్రయోజనం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఆ నిధులను మళ్లించి యూకో బ్యాంక్‌ను మోసం చేశారు. దీంతో ఆ బ్యాంక్​ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు 2009 ఏప్రిలో సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణలో, నిందితులు ఒకరితో ఒకరు కుట్ర పన్ని, రుణ నిధుల వినియోగాన్ని చూపేందుకు తప్పుడు సమాచారం అందించినట్లు అధికారులు గుర్తించారు.

Bank Fraud Case | రూ.3.5 లక్షల జరిమానా

దర్యాప్తు పూర్తయిన అనంతరం 2010జూన్​లో సీబీఐ నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. న్యాయస్థానం, విచారణ అనంతరం, నిందితులను దోషులుగా నిర్ధారించి, తదనుగుణంగా శిక్ష విధించింది. ఒక్కొక్కరికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3.5 లక్షల జరిమానా వేసింది. సీబీఐ దర్యాప్తు చేసి, విచారించిన బ్యాంకు మోసాల కేసులలో అమిత్ చతుర్వేది, సంజయ్ చతుర్వేది, ప్రవీణ్ జునేజాలకు ఇది మూడవ శిక్ష కావడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Free Police Job Training | పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ: సీపీ సాయిచైతన్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *