అక్షరటుడే, వెబ్డెస్క్: Bhogapuram Airport | ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధానితో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఇతర ప్రముఖులు, జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జి. మల్లిఖార్జున రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఆధునిక సదుపాయాలను ప్రధాని మోదీ పరిశీలించారు. చెక్-ఇన్ హాల్, ఎయిర్పోర్ట్ డిజైన్, టెక్నికల్ ప్రత్యేకతలను జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు.
Bhogapuram Airport | ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్యం..
విమానాశ్రయ ప్రారంభోత్సవంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహించిన థింసా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు సహా మొత్తం 13,750 మంది ఈ నృత్యంలో పాల్గొని ప్రధానికి అద్భుత స్వాగతం పలికారు. ప్రయాణికుల టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఈ ప్రదర్శన సాగింది. ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్తున్నంతసేపు ప్రధాని మోదీ ఈ నృత్యాన్ని తిలకించి అభినందించారు.
భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు టెర్మినల్ను ఓపెన్ చేసి పరిశీలిచారు. కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ… pic.twitter.com/CNGETpjI7K
— Akshara Today | Telugu News (@aksharatoday) August 1, 2026
ఇది కూడా చదవండి..: IBPS Clerk Recruitment | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల