అక్షరటుడే వెబ్డెస్క్: Meloni Modi | ఇటలీ యుద్ధానంతర రాజకీయ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం వరుసగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేతగా జార్జియా మెలోని అరుదైన రికార్డు సృష్టించారు. ఈ చారిత్రక ఘనత సాధించిన ఆమెకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
Meloni Modi | ప్రజల నమ్మకం..
మెలోని సాధించిన రికార్డు ఇటలీ ప్రజల విశ్వాసానికి, ఆమె సమర్థ నాయకత్వానికి నిదర్శనమని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత్-ఇటలీ మధ్య ఉన్న ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్’ (ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం) బలోపేతం కావడంలో మెలోని స్నేహం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల కోసం ఒక సంపన్నమైన భవిష్యత్తును నిర్మించే దిశగా ఆమెతో కలిసి సన్నిహితంగా పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆమె భవిష్యత్తు విజయాలకు మోడీ అభినందనలు తెలిపారు.
Meloni Modi | భారత్-ఇటలీ బంధం..
ప్రధాని మోడీ శుభాకాంక్షలపై ఎక్స్ వేదికగా జార్జియా మెలోని స్పందించారు. “ప్రియమైన నరేంద్ర మోదీ.. మీ శుభాకాంక్షలకు, మీ ప్రత్యేక స్నేహానికి ధన్యవాదాలు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం భారత్, ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల ఇరు దేశాల మధ్య ప్రారంభించిన స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బంధం ప్రాధాన్యతను చాటుతోందని మెలోని గుర్తుచేశారు. రెండు దేశాల వద్ద ఉన్న నైపుణ్యాలను ఒకచోట చేర్చి, భవిష్యత్తులో కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Grazie, caro @narendramodi, per le tue parole e per la tua amicizia.
Il rapporto tra Italia e India è oggi più forte che mai 🇮🇹🇮🇳Il Partenariato Strategico Speciale che abbiamo lanciato durante il nostro ultimo incontro è il riconoscimento dell’importanza di questo legame e… https://t.co/7xQgo7RbvH
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026
ఇది కూడా చదవండి: Revanth Government Failure | హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి