అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP Chief Letter | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు లేఖ రాశారు. తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాల వినియోగంపై ఆయన లేఖలో ప్రస్తావించారు.
గోదావరి జలాలను తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని రాంచందర్రావు పేర్కొన్నారు. గోదావరి నదిపై 360 టీఎంసీల ప్రాజెక్టులకు.. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై నిర్లక్ష్యంచేశారని విమర్శించారు. దీంతో 200 టీఎంసీలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు వచ్చినా సీతారామసాగర్ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయడంలేదని మండిపడ్డారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్లోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు.
BJP Chief Letter | బీఆర్ఎస్ హయాంలో..
కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే, గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే మూడు బ్యారేజీల రూపకల్పనలో లోపాలు, నిర్మాణంలో అసమర్థత కారణంగా 2023 సంవత్సరంలో వాటి నిర్మాణం తీవ్రంగా దెబ్బతిందన్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, మీ పాలనలోని చివరి రెండున్నర సంవత్సరాలలో, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA) పలు నివేదికలను ఇచ్చిందన్నారు. అయినా బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళిక మరియు అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి నేను రాసిన బహిరంగ లేఖ.
పూర్తి వివరాలు… pic.twitter.com/NlO4IXUJVl
— N Ramchander Rao (@N_RamchanderRao) May 24, 2026
దీనిని కూడా చదవండి : Caste Names Change | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కులాల పేర్లు మార్పు


