అక్షరటుడే, బోధన్: Bodhan Police Station | గంజాయి మత్తులో వ్యక్తి పోలీస్స్టేషన్లో హల్చల్ చేశాడు. పోలీసులపై దాడికి సైతం తెగబడ్డాడు. ఈ ఘటన బోధన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
Bodhan Police Station | ఓ మహిళ చికిత్స విషయమై..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం (Bodhan Mandal) కొప్పర్గా గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి కొన్నిరోజుల క్రితం వచ్చింది. అక్కడ చికిత్స అనంతరం ఆమె కొప్పర్గకు వెళ్లిపోయింది. అయితే శుక్రవారం రాత్రి ఆ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి హల్చల్ చేశాడు. సదరు మహిళకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమిటని ప్రశ్నిస్తూ డ్యూటీ డాక్టర్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో భయభ్రాంతులకు గురైన వైద్యురాలు, సిబ్బంది కలిసి డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు స్పందించి ఆస్పత్రికి చేరుకుని ఆ వ్యక్తిని పోలీస్స్టేషన్కు తరలించారు.
Bodhan Police Station | పోలీస్స్టేషన్లో హంగామా..
అయితే గంజాయి మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఆగ్రహంతో సీఐ, కానిస్టేబుల్పై దాడికి తెగబడ్డారు. సీఐ తొడపై దాడి చేశాడు. . అలాగే కానిస్టేబుల్ వేలు కొరకడంతో కొద్దిభాగం తెగిపోయింది. దీంతో హతాశులైన పోలీసులు వెంటనే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Kaleshwaram Project | కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారు.. మంత్రి పొంగులేటి..