అక్షరటుడే, మెదక్ : Burgupalli Rathotsavam | మెదక్ (Medak) జిల్లా హవేళి ఘన్పూర్ మండలం బూర్గుపల్లిలో సోమవారం తెల్లవారు జామున రథోత్సవం నిర్వహించారు. గ్రామంలో నాలుగు రోజులుగా ఉత్సవాలు సాగుతున్నాయి.
మూడు రోజుల పాటు గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున నల్లపోచమ్మ ఆలయం (Nalla Pochamma Temple) వద్ద రథాన్ని తింపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి తరలి వచ్చారు. అమ్మవారికి పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ లెంక రాజు, కాంగ్రెస్ నాయకుడు చిట్యాల శ్రీనివాస్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Education Performance | విద్యా రంగంలో తెలంగాణకు మెరుగైన గుర్తింపు.. కేంద్ర పీజీఐ నివేదికపై సీఎం హర్షం


