అక్షరటుడే, వెబ్డెస్క్ : Drugs Case | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగులు సైతం డ్రగ్స్ తీసుకుంటున్నారు. అంతేగాకుండా విక్రయాలు సైతం జరుపుతున్నారు.
Drugs Case | డ్రగ్స్ విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగి
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ అమ్నాహమద్ (23) అనే ఐటీ ఉద్యోగి విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా అతడు అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.లక్ష విలువైన 7 గ్రాముల ఎండీఎంఏను, ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేశారు. డ్రగ్ పెడ్లర్లు అమిర్, రాహీల్, వినియోగదారుడైన మధు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: HYDRAA Demolitions | ప్రమాదకరంగా ఉన్న భవనాలు తొలగిస్తాం : హైడ్రా కమిషనర్