Ebola Alert Hyderabad | శంషాబాద్‌లో ఎబోలా లక్షణాలతో వ్యక్తి గుర్తింపు.. గాంధీకి తరలింపు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ebola Alert Hyderabad | ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భాగ్యనగరంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడికి ‘ఎబోలా వైరస్'( Ebola Virus ) హిస్టరీ ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ebola.1 1

Ebola Alert Hyderabad | స్క్రీనింగ్‌లో దొరికిన ప్రయాణికుడు..

గురువారం సూడాన్‌ దేశం నుండి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహ్మద్‌ అనే ప్రయాణికుడికి విమానాశ్రయంలోని ప్రత్యేక హెల్త్ డెస్క్ వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అతనికి గతంలో ఎబోలా సోకినట్లు లేదా ఆ వైరస్ లక్షణాల హిస్టరీ ఉన్నట్లు వైద్య సిబ్బంది గమనించారు. దీంతో అలర్ట్ అయిన ఎయిర్‌పోర్టు ఆరోగ్య విభాగం.. నిబంధనల ప్రకారం ప్రయాణికుడిని ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించింది.

ebola 2

Ebola Alert Hyderabad | గాంధీలో ఐసోలేషన్..

ప్రస్తుతం ఆ బాధితుడిని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎబోలా ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతనికి వైరస్ యాక్టివ్‌గా ఉందో లేదో నిర్ధారించుకునేందుకు వైద్యులు రక్త నమూనాలను (శాంపిల్స్‌) సేకరించారు. ఈ నమూనాలను తదుపరి ల్యాబ్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ (CCMB) కి పంపినట్లు గాంధీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Singareni scam | సింగరేణిలో కుంభకోణం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *