నిజామాబాద్Electric Shock Death | పిండిగిర్ని శుభ్రం చేస్తుండగా విద్యుత్​షాక్​.. మహిళ మృతి

Electric Shock Death | పిండిగిర్ని శుభ్రం చేస్తుండగా విద్యుత్​షాక్​.. మహిళ మృతి

రుణం తీసుకుని ఉపాధి నిమిత్తం పిండి గిర్ని ఏర్పాటు చేసుకున్న ఓ మహిళ.. ఆ గిర్నిని శుభ్రంచేస్తూ విద్యుత్​షాక్​తో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో శనివారం చోటు చేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి: Electric Shock Death | రుణం తీసుకుని ఉపాధి నిమిత్తం పిండి గిర్ని ఏర్పాటు చేసుకున్న ఓ మహిళ.. ఆ గిర్నిని (flour mill accident) శుభ్రంచేస్తూ విద్యుత్​షాక్​తో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన భిక్కనూరు (Bhikkanoor) మండలం పెద్ద మల్లారెడ్డిలో శనివారం చోటు చేసుకుంది.

Electric Shock Death | శుభ్రం చేస్తుండగా..

భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో బండి రేణుక (35) ఉపాధి నిమిత్తం రుణం తీసుకుని చిన్న పిండిగిర్ని ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే శనివారం ఉదయం గిర్ని స్టార్ట్​ చేసేముందు నీళ్లుచల్లి శుభ్రం చేస్తుండగా కరెంట్​షాక్​ కొట్టింది. దాంతో ఆమె అక్కడే కిందపడగా తలకు బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కామారెడ్డిలో (kamareddy) ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. మృతురాలి భర్త యోగేష్ గ్రామంలో చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh Durga | ఇంద్రకీలాద్రిపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐ...

Bandi Bhagirath | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వివాదం..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bandi Bhagirath | కేంద్రమంత్రి బండి సంజయ్​ కుమారుడు...

Car Tanker Blast | గ్యాస్ నింపుతుండగా పేలిన కారు ట్యాంకు.. మూడు కార్లు, బైక్​ దగ్ధం..

అక్షరటుడే, కామారెడ్డి: Car Tanker Blast | కార్లలో దొంగచాటుగా గ్యాస్​...