అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Ganja Seizure | నగరంలోని రైల్వేస్టేషన్లో (Nizamabad Railway Station) భారీగా గంజాయి పట్టుబడింది. ఈ మేరకు ఎక్సైజ్ (Nizamabad Excise), ఆర్పీఎఫ్ పోలీసులు వివరాలు వెల్లడించారు.
Nizamabad Ganja Seizure | నాగావళి ఎక్స్ప్రెస్లో..
సంబల్పూర్ నుంచి నాందేడ్ (nanded) వెళ్తున్న నాగావళి ఎక్స్ప్రెస్లో (Nagavali Express) గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్లో రైలును తనిఖీలు చేసి పొన్నంచంద్ శంకర్ రావ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 5.35కిలోల గంజాయిని స్వాధీనం చేసకున్నారు. గంజాయిని విశాఖపట్నం (Visakhapatnam) నుంచి నాందేడ్కు తీసుకెళ్తున్నట్లు విచారణలో అతడు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టారు. తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్హెచ్వో స్వప్న, ఎస్సై మల్లేష్, సిబ్బంది మోహన్ సింగ్, గౌతం, దేవేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bandi Bhageerath Surrender | పోక్సో కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన బండి భగీరథ్


