Elephant Rampage | ఏనుగు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Elephant Rampage | కేరళ (Kerala)లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. త్రిస్సూర్ నగరంలో బంధించబడిన ఒక ఏనుగు శనివారం నియంత్రణ కోల్పోయి నివాస ప్రాంతాల్లోకి దూసుకొచ్చింది. దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆగ్రహించిన ఏనుగు అదుపు తప్పడంతో, పాదచారులు వాహనదారులు భయంతో పరుగులు తీశారు. ఏనుగు దాడిలో అనేక ద్విచక్ర వాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. ఓ కారులో మహిళ ఉండగా ఏనుగు దానిని తలకిందులుగా చేసింది. అది వెళ్లిపోయిన తర్వాత స్థానికులు ఆ మహిళను కారులో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయట పడ్డారు.

Elephant Rampage | ఆస్తి నష్టం

ఏనుగును నియంత్రించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దానిని బంధించి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టాన్ని కలిగించడంతో పాటు, పట్టణ ప్రాంతాలలో బంధించబడిన ఏనుగుల సంరక్షణలో భద్రతా చర్యలపై ఆందోళనలను రేకెత్తించింది.

 

దీనిని కూడా చదవండి: Odisha Fire Accident | జలవిద్యుత్​ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *