అక్షరటుడే, న్యూఢిల్లీ: Emergency Alert | దేశవ్యాప్తంగా మే 2న లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో సైరన్ మోగవచ్చు. దీనిని చూసి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న ‘టెస్టింగ్’లో ఇది ఒక భాగం.
Emergency Alert | ఏమిటి ఈ ‘సాచెట్’ వ్యవస్థ?
భూకంపాలు, వరదలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలందరినీ ఏకకాలంలో అప్రమత్తం చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ‘సాచెట్’ (SACHET) అనే అత్యాధునిక హెచ్చరిక వ్యవస్థను రూపొందించాయి. ఈ వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు శనివారం (మే 2న) దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహిస్తున్నారు.
Emergency Alert | మీ ఫోన్లో ఏం జరుగుతుంది?
పరీక్షలో భాగంగా మీ మొబైల్ స్క్రీన్పై ఒక ‘ఎమర్జెన్సీ అలర్ట్’ మెసేజ్ ప్రత్యక్షమవడంతో పాటు పెద్ద శబ్దంతో సైరన్ వినిపిస్తుంది. మీ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నప్పటికీ ఈ అలర్ట్ శబ్దం వినిపించే అవకాశం ఉంది. ఇది కేవలం ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష మాత్రమే కాబట్టి, ఆ మెసేజ్ను చూసి భయపడాల్సిన పని లేదు. మీరు ఎటువంటి చర్యలు తీసుకోనక్కర్లేదు.
Emergency Alert | ఈ టెక్నాలజీ వల్ల ప్రయోజనాలు..
అంతర్జాతీయ ప్రమాణాల (CAP) ప్రకారం రూపొందించిన ఈ వ్యవస్థ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. విపత్తు సంభవించే ముందే సెకన్ల వ్యవధిలో సమాచారాన్ని పంపి ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. ప్రమాదం పొంచి ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని ఫోన్లకు మాత్రమే హెచ్చరికలు పంపేలా దీనిని డిజైన్ చేశారు.
ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయడం ద్వారా రేపు వారు అకస్మాత్తుగా వచ్చే సైరన్ శబ్దానికి కంగారు పడకుండా అప్రమత్తం చేయవచ్చు.
ఇది కూడా చదవండి..: Hyderabad ORR | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

