అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad ORR | మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై మరోసారి రక్తం చిందింది. అతివేగం, అజాగ్రత్త ఐదుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Hyderabad ORR | ఘటన వివరాలు..
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని శంషాబాద్ ఓఆర్ఆర్పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక భారీ లారీని, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అత్యంత బలంగా ఢీకొట్టింది. కారు ఎంత వేగంతో ఉందంటే, ఢీకొన్న ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
Hyderabad ORR | అక్కడికక్కడే ఐదుగురి మృతి
ఈ ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను సిరిసిల్లకు చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాదానికి కారణం..
ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లారీని అక్కడ ఎందుకు నిలిపి ఉంచారు? కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలేంటి? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి..: Son Attack Father | తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు..

