అక్షరటుడే, వెబ్డెస్క్ : Exam Reforms Task Force | పరీక్షల సంస్కరణకు శ్రీకారం చుట్టామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఈ మేరకు ఆయన మరో వీడియో విడుదల చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పరీక్షా విధానాలను ఎలా మెరుగుపరచాలనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు, ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు.
Exam Reforms Task Force | కొత్త చట్టం తెస్తాం
ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని ప్రధాని తెలిపారు. పార్లమెంటులో కూడా, కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
Exam Reforms Task Force | టాస్క్ఫోర్స్ సభ్యులు వీరే..
పరీక్షల విధానంపై సంస్కరణల కోసం ఏర్పాటు చేయనున్న టాస్క్ఫోర్స్లో నీలేకనితో పాటు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కవల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా ఉన్నారు.
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
దీనిని కూడా చదవండి : Komuravelli Railway Station | కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. తీరనున్న భక్తుల కష్టాలు