అక్షరటుడే, ఇందూరు: Farmer Power Services | రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే (electricity department) లక్ష్యంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(Northern Telangana Power Distribution Company) పనిచేస్తోందని నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
Farmer Power Services | వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్..
ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో 20 డిపార్ట్మెంట్ వాహనాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అందులో ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయబడిందన్నారు. తద్వారా ప్రతి వాహనం మూవ్మెంట్ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామని వివరించారు.ప్రతి డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలు అందుబాటులో ఉంటాయని.. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని సమాచారం అందగానే వెంటనే సదరు వాహనం అక్కడికి చేరుకుంటుందన్నారు. అలాగే వందశాతం మెరుగైన సేవలందిస్తుందని ఆయన వివరించారు.
Farmer Power Services | వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత..
వ్యవసాయ రంగానికి(agricultural sector) విద్యుత్ సరఫరా అత్యంత ప్రాధాన్యమని, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సేవలు అందించేందుకు ఈ ప్రత్యేక డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ సమయంలో రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగకరమని వివరించారు. ఎలాంటి తక్షణపరమైన సమస్యలు తలెత్తిన వెంటనే 1912కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే తక్షణం స్పందించి తక్షణపరమైన విద్యుత్ సేవలు అందిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana DSP Transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు


[…] […]