అక్షరటుడే, వెబ్డెస్క్: Fuel Price Hike | కేంద్ర ప్రభుత్వం (Central Government) దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెంచిన విషయం తెలిసిందే. దీనిపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదలతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. పెంచిన ధరలు నేటి ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి. దేశంలో లీటర్కు రూ.3కు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్వేదికగ స్పందించారు. మోదీ ప్రభుత్వం చేసిన తప్పుకు.. ప్రజలు డబ్బులు కట్టాల్సి వస్తోందన్నారు. రూ.3 రేట్లు ఇప్పటికే పెరిగాయని, మిగతా రేట్లు రానున్న రోజుల్లో విడతల వారీగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. బలహీనపడిన ప్రధానమంత్రి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు. ఆయన అదానీ విడుదల కోసం ఒక ఒప్పందాన్ని కుదిర్చారు అని మరో పోస్ట్లో పేర్కొన్నారు.
Fuel Price Hike | ఇంకా పెరుగుతాయా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి మీదుగా రవాణా నిలిచిపోవడంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 70 డాలర్లు ఉండగా.. ప్రస్తుతం 100 డాలర్లు దాటింది. అయితే ధరలు పెరిగిన కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఇన్ని రోజులు పెంచలేదు. దీంతో ఆయా చమురు సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ధరలు పెంచలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు అయిపోవడం, ఫలితాలు వెలువడంతో ధరల బాదుడు మొదలైంది. మొదట గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం, తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. అయితే రానున్న రోజుల్లో మరింత రేట్లు పెరుగుతాయని రాహుల్ గాంధీ పేర్కొనడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: ITR Filing 2026 | ఐటీఆర్ ఫైలింగ్కు వేళాయె!.. ఐటీఆర్-1, 4 ఎక్సెల్ యుటిలిటీల విడుదల


