అక్షరటుడే, భీమ్గల్: GPO Issues Resolution | తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ పరిపాలన అధికారులు (జీపీవో) (GPO) కోరారు. ఈ మేరకు జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గొర్తె రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) (TGMDC) ఛైర్మన్ అనిల్ ఈరవత్రిని(Anil Eravathri) కలిసి వారు వినతిపత్రం సమర్పించారు.
GPO Issues Resolution | జీపీవోలదే కీలకపాత్ర..
గొర్తె రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న జీపీవోల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలని ఛైర్మన్ను కోరారు. ఇందుకు టీజీఎండీసీ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీపీవోల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం పృథ్వీరాజ్, ధర్పల్లి మండల జీపీవో అధ్యక్షుడు తెప్ప రాజేష్, పడ్కాల్ జీపీవో అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Inspector Transfers | మల్టీజోన్–1 పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీ

