అక్షరటుడే వెబ్డెస్క్:Hajj Subsidy Telangana| పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హజ్ యాత్రికులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికులపై పడే అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Hajj Subsidy Telangana| యుద్ధ మేఘాల ప్రభావం..
ప్రస్తుతం ఇరాన్ , అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం విమాన ప్రయాణ ఖర్చులపై పడటంతో, హజ్ యాత్ర మునుపటి కంటే భారంగా మారింది. తమ జీవితకాల సంపాదనను ఒక్క రూపాయి చొప్పున దాచుకుని మక్కా వెళ్లాలనుకునే పేద ముస్లింలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.
Hajj Subsidy Telangana| 7 వేల మందికి ప్రయోజనం..
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 7 వేల మంది యాత్రికులు హజ్ యాత్ర కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పెరిగిన ఇంధన ధరలతో వీరిపై పడే అదనపు ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేద ముస్లింల ఆశయాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో హజ్ యాత్రికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అదనపు ఖర్చుల ఆందోళన లేకుండా యాత్రికులు తమ పవిత్ర యాత్రను పూర్తి చేసుకునే అవకాశం కలిగింది.
హజ్ యాత్రికులకు శుభవార్త
హజ్ భారం భరించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో హజ్ యాత్ర భారంగా మారిన నేపథ్యంలో యాత్రికులపై పడే భారాన్ని భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఈ నేపథ్యంలో హజ్ యాత్రికుల భారం భరించాలని నిర్ణయం… pic.twitter.com/2jHqvgLdCb
— BIG TV Breaking News (@bigtvtelugu) May 5, 2026
ఇది కూడా చదవండి: Transfers | రాష్ట్రంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ

