Harish Rao Arrest | హరీశ్​రావును అడ్డుకున్న పోలీసులు.. తెలంగాణ భవన్​ వద్ద ఉద్రిక్తత

గన్​పార్క్​కు బయలు దేరిన మాజీ మంత్రి హరీశ్​రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ భవన్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Arrest | కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్​ఎస్​ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్​ ప్రభుత్వంలో గురుకులాల్లో అవినీతిపై చర్చకు సిద్ధమని రెండు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే.

చర్చ కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్​, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​, అజారుద్దీన్​ గన్​పార్క్​ వద్దకు చేరుకున్నారు. మరోవైపు తాను తెలంగాణ భవన్​కు వస్తానని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు తెలంగాణ భవన్​కు చేరుకున్నారు. హరీశ్​రావు, ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్​ కాంగ్రెస్​ నేతలతో చర్చించేందుకు గన్​పార్క్​కు బయలు దేరారు. జూపల్లి కృష్ణారావు కోసం తెలంగాణ భవన్​లో కేటీఆర్​ (KTR) ఎదురు చూస్తున్నారు. అయితే హరీశ్​రావును పోలీసులు అడ్డుకున్నారు.

Harish Rao Arrest | అదుపులోకి తీసుకోవడంతో..

కారులో గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీశ్​రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. హరీశ్​రావు కారులో నుంచి దిగి నడుచుకుంటూ గన్​ పార్క్​ వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) ఎదుట రోడ్డుపై బైఠాయించిన హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మంత్రులు చర్చకు పిలిచి.. పోలీసులతో అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao Arrest | ఎందుకు ఆపుతున్నారు

హరీశ్​రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్​ నేతలు చర్చకు ధైర్యంగా పిలిచి.. ఇప్పుడు పోలీసులను పెట్టి ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని సవాల్​ విసిరారు. తమను ఆపాల్సిన అవసరం ఏమిటన్నారు. కాంగ్రెస్​ నాయకులు అవినీతికి పాల్పడటంతోనే తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డ్రగ్స్​ సప్లయ్​ చేస్తూ దొరికిన దొంగకు గురుకుల టెండర్లు కట్టాబెట్టారన్నారు. సవాల్ విసరడం ఎందుకని, పోలీసులను అడ్డు పెట్టుకొని పారిపోవడం ఎందుకని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Fake Mutton Hyderabad | తక్కువ ధరకు మటన్​ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *