అక్షరటుడే, హైదరాబాద్: High Court Notices | పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాల (Traffic Challans) కారణంగా వాహనాన్ని అక్రమంగా సీజ్ చేశారన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర పోలీస్ బాస్ (DGP) సీవీ ఆనంద్ (C.V. Anand)తో పాటు పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.
High Court Notices | ఏం జరిగిందంటే?
ట్రాఫిక్ చలానాలు పెండింగ్లో ఉన్నాయనే నెపంతో ఒక వాహనాన్ని, దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (Registration Certificate)ను పోలీసులు సీజ్ చేశారు. అయితే, కేవలం చలానాల కోసం వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని బాధితుడు కోర్టును ఆశ్రయించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు (High Court), సంబంధిత అధికారుల తీరుపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.
High Court Notices | నోటీసులు అందుకున్న అధికారులు:
సీవీ ఆనంద్: తెలంగాణ డీజీపీ.
జోయల్ డేవిస్: అడిషనల్ సీపీ (ట్రాఫిక్).
కె. ఇల్లంబర్తి: ట్రాన్స్పోర్ట్ కమిషనర్.
బి. శివధర్ రెడ్డి: మాజీ డీజీపీ.
వీరితో పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన సీఐ , ఇద్దరు ఎస్ఐలకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
High Court Notices | స్వాధీనం చేసుకునే హక్కు లేదు:
చట్ట నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను సీజ్ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం చలానాలు వసూలు చేయాలి తప్ప, వాహనాలను లేదా ఆర్సీలను స్వాధీనం చేసుకునే హక్కు పోలీసులకు లేదని గతంలోనే పలు సందర్భాల్లో స్పష్టతనిచ్చినప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై ధర్మాసనం మండిపడింది.
ఇది కూడా చదవండి..: Peddapalli Nizamabad Section | పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వే సెక్షన్ మార్పు.. నేడు నిజామాబాద్ జిల్లాకు డీఆర్ఎం

