Gurukul Food Poisoning | గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులకు అస్వస్థత

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్​ పాయిజన్​ అయింది. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gurukul Food Poisoning | నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్​ పాయిజన్​ అయింది. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం విద్యార్థులు టిఫిన్​ చేశారు. అనంతరం 26 మంది అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో సిబ్బంది వారిని వెంటనే మన్ననూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. అయితే ఆ ఆస్పత్రిలో బెడ్లు సరిపోకపోవడంతో విద్యార్థులను నేలపై పడుకొబెట్టి చికిత్స చేశారు. అనంతరం వారిని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.

Gurukul Food Poisoning | నిలకడగా ఆరోగ్యం

అల్పాహారం చేసిన కొద్దిసేపటికే, విద్యార్థులకు విరేచనాల లక్షణాలు కనిపించి, తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పాఠశాల సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాలలు పున:ప్రారంభమై ఇంకా నెల రోజులు కూడా కావడం లేదు. అప్పుడే రెండు పాఠశాలల్లో ఫుడ్​ పాయిజన్​ కావడం ఆందోళన కలిగిస్తోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్​లోని గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. రాత్రి భోజనం అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.

Gurukul Food Poisoning | తల్లిదండ్రుల ఆందోళన

గురుకుల పాఠశాల్లోల 6వ తరగతి నుంచి విద్యార్థులు ఉంటారు. తల్లిదండ్రులు ప్రభుత్వంపై నమ్మకంతో తమ పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. అయితే ఫుడ్​ పాయిజన్​ ఘటనలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ పిల్లలు ఏం తింటున్నారో.. ఎలా ఉంటున్నారో అని వారు ఆందోళన చెందుతున్నారు. అసలే వర్షాకాలం.. సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే ఫుడ్​ పాయిజన్​ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Godavari Water Levels | దిగువన గోదావరికి జలకళ.. ఎగువన వెలవెల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *