అక్షరటుడే, వెబ్డెస్క్ : Kaleshwaram Project | తెలంగాణ కేబినెట్ (Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు (High Court) ఇచ్చిన జడ్జిమెంట్ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ (PC Gosh Commission) నివేదికపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్రావుపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారంలో వారికి ఊరట లభించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై దేశ అత్యున్నత ధర్మాసనంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రాజెక్టు రీడిజైనింగ్, వ్యయం, ఇతర అంశాలపై గతంలో వచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ప్రభుత్వం కోరనుంది.
Kaleshwaram Project | కీలక తీర్మానాలు
సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద చర్చ జరిగింది. ప్రాజెక్టు సాంకేతిక, న్యాయపరమైన అంశాలను అత్యున్నత న్యాయస్థానంలో బలంగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా కాళేశ్వరంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సైతం ఇదే స్పష్టం చేసింది. అయితే కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఎస్ కే జోషిలకు ఊరట లభించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
దీనిని కూడా చదవండి : RTC Strike Loss | సమ్మె ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.17 కోట్లకు పైగా నష్టం!

