అక్షరటుడే, వెబ్డెస్క్ : Vasavi Matha Jayanthi | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సంస్కృతిని గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా (State Function) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) ఉత్తర్వులు జారీ చేస్తూ పూర్తి వివరాలను వెల్లడించింది.
ప్రతి సంవత్సరం ‘వైశాఖ శుక్ల పక్ష దశమి’ తిథి నాడు శ్రీ వాసవీ మాత జయంతిని తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తారు. ప్రస్తుత 2026 సంవత్సరంలో ఈ పవిత్ర తిథి ఏప్రిల్ 26వ తేదీన రావడంతో, ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Vasavi Matha Jayanthi | అత్యంత వైభవంగా
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో ఈ జయంతి వేడుకలను అధికారిక లాంఛనాలతో, అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. ఈ వేడుకల పర్యవేక్షణ బాధ్యతను ‘యువజన సర్వీసులు, పర్యాటక , సాంస్కృతిక శాఖ’కు (YAT&C Department) అప్పగించారు. ఈ వేడుకలకు అయ్యే ఖర్చును ఆయా శాఖల బడ్జెట్ నుంచే కేటాయించాలని స్పష్టం చేశారు.
Vasavi Matha Jayanthi | ప్రభుత్వంపై ప్రశంసలు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. దీనికి సంబంధించిన ప్రతిలను డీజీపీ, కలెక్టర్లు , అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం నిమిత్తం పంపారు. వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు , భక్తులు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాసవీ దేవాలయాల్లో ఏప్రిల్ 26న ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Telangana Government declares Sri Vasavi Matha Jayanthi as an annual State Function.
It will be observed every year on “Vaisakha Shukla Paksha Dashami.”
For 2026, the date falls on 26 April. pic.twitter.com/mJcHvGEiQY
— IPRDepartment (@IPRTelangana) April 23, 2026
దీనిని కూడా చదవండి : Kavitha new party | ఎల్లుండి కవిత కొత్త పార్టీ.. పేరు అదేనా..

