అక్షరటుడే, వెబ్డెస్క్ : Kharge Comments | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ (PM Modi)ని టెర్రరిస్ట్ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Elections) కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఏఐఏడీఎంకేను విమర్శిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని “ఉగ్రవాది” అని ఖర్గే వివాదాన్ని రేకెత్తించారు.
చెన్నైలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ, “వారు (AIADMK) మోదీతో ఎలా చేతులు కలపగలరు? ఆయన ఒక ఉగ్రవాది. ఆయన సమానత్వాన్ని విశ్వసించరు. ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు. ఇలాంటి వారితో వీరు చేతులు కలుపుతున్నారు. అంటే వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం,” అని పేర్కొన్నారు.
Kharge Comments | వ్యాఖ్యలపై వివరణ
ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యపై ఖర్గే వివరణ ఇస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ (BJP)తో కుమ్మక్కై పనిచేస్తున్నందున, ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను “భయభ్రాంతులకు గురిచేస్తున్నారని” ఆరోపించారు. ప్రధాని మోదీ ఎప్పుడూ తమను బెదిరిస్తుంటారని తాను చెప్పాలని అనుకున్నట్లు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ, ఈడీ (ED), ఇతర సంస్థలు ఆయన చేతుల్లోనే ఉన్నాయని చెప్పానని, ఆయన స్వయంగా ఉగ్రవాది తాను ఎప్పుడూ అనలేదన్నారు.
Kharge Comments | బీజేపీ ఆగ్రహం
ప్రధాని మోదీపై ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’ వ్యాఖ్యను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు, అలాగే ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిని ఉగ్రవాది అని పిలిచారని మండిపడ్డారు. ఆయనను, మన దేశ ప్రజలను అవమానించినందుకు ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దీనిని కూడా చదవండి : Tamil Nadu Election | తమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

