అక్షరటుడే, వెబ్డెస్క్ : Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) సోమవారం తన పార్టీ ఎన్నికల అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పాదయాత్రలు, జనసభలలో ప్రజల నుంచి లభించిన అఖండ మద్దతును ఆమె ప్రస్తావించారు.
“మా-మాటి-మనుష్” విజయం కేవలం సమయం మాత్రమే అని నొక్కి చెప్పారు. సోమవారం ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు చూపిన ఉత్సాహం, నిజమైన ఆప్యాయత, భావోద్వేగం తనను మాటల్లో వర్ణించలేని విధంగా కదిలించాయన్నారు. ఈ నేల ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ సంవత్సరాలుగా కలిసికట్టుగా నిలబడటం ద్వారా ఏర్పడిన బంధం ఇది అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం ఎప్పటినుంచో సామరస్యానికి, నాగరికతకు గర్వకారణమైన దీపస్తంభంగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు.
Mamata Banerjee | మమతకు నోటీసులు
మమతా బెనర్జీ ఎన్నికల ర్యాలీలో షెడ్యూల్డ్ కులాల వర్గానికి వ్యతిరేకంగా అవమానకరమైన భాషను ఉపయోగించారు. ఈ వీడియో వైరల్ కావడంతో జాతీయ ఎస్సీ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కోల్కతా (Kolkata)లోని చౌరింగీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాము చర్య తీసుకున్నామని తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు కమిషన్ తన నోటీసులో పేర్కొంది. మూడు రోజుల్లోగా తీసుకున్న చర్యల నివేదికను పంపాలని ఆ నోటీసు అధికారులను కోరింది.
ఇది కూడా చదవండి..: Bengal Elections | బెంగాల్లో కమలం వికసిస్తుంది : ప్రధాని మోదీ

