అక్షరటుడే, వెబ్డెస్క్ : LPG Ships | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా నౌకల రవాణా పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో అనేక దేశాలు ఇంధన, గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్కు చెందిన రెండు ఎల్పీజీ నౌకలు జలసంధిని దాటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపంది.
ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ (Mukesh Mangal) గురువారం మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి రెండు ఎల్పీజీ రవాణా నౌకలు హర్ముజ్ మీదుగా ప్రయాణించాయని చెప్పారు. మార్షల్ ఐలాండ్ జెండా కలిగిన ‘సెహ్మి’ అనే నౌక భారత్ కోసం 19,965 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకును తీసుకువస్తోందన్నారు. 21 మంది విదేశీ సిబ్బందితో వస్తున్న ఆ షిప్ మే 16న కాండ్లాకు చేరుకుంటుందని అంచనా.
LPG Ships | 18న మంగళూరుకు..
వియత్నాం జెండా కలిగిన ‘ఎన్వి సన్షైన్’ అనే నౌక భారత్ కోసం 46,427 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ తీసుకువస్తోంది. అందులో 24 మంది విదేశీ సిబ్బందితో ఉన్నారు. ఇది మే 18 న్యూ మంగళూరుకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సోమాలియా నుంచి షార్జాకు ప్రయాణిస్తున్న ‘హాజీ అలీ’ అనే భారతీయ యాంత్రిక పడవ ప్రమాదానికి గురైంది. మే 13 తెల్లవారుజామున ఒమన్ జలాల్లో నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగి, అది మునిగిపోయింది. అందులోని 14 మంది సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించారు.
దీనిని కూడా చదవండి : Delhi Fuel Saving Measures|ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. వారానికి రెండు రోజులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్


