అక్షరటుడే, వెబ్డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పికప్ వ్యాన్ బోల్తా పడింది. అనంతరం అది ఓ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు.
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా (Dhar District)లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై చికిలియాలోని రిలయన్స్ పెట్రోల్ పంపు సమీపంలో ప్రమాదం జరిగింది. కూలీలతో కిక్కిరిసి ఉన్న పికప్ ట్రక్కు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది. ట్రక్కు సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకువెళుతున్నట్లు అధికారులు తెలిపారు. వాహనం బోల్తా పడిన తర్వాత దానిని ఎస్యూవీ వాహనం ఢీకొంది.
Madhya Pradesh Accident | 50 మంది కూలీలతో..
పికప్ ట్రక్ 50 మంది కూలీలతో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో మొదట ఐదుగురు మృతి చెందారు. ఆ ప్రాంతం మృతదేహాలు, నెత్తుటి మరకలతో భయానకంగా మారింది. గురువారం ఉదయం వరకు మృతుల సంఖ్య 16కు పెరిగింది. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఇండోర్కు తరలించారు.
Madhya Pradesh Accident | తిరిగి వెళ్తుండగా..
కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, ఇండోర్ డివిజనల్ కమిషనర్ సుదామా ఖడే, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇండోర్ రేంజ్) అనురాగ్తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. బగ్గడ్ గ్రామం సమీపంలోని పొలాల్లో పనిచేసి పికప్ ట్రక్కులో తిరిగి వస్తున్న కూలీల విషయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. వాహనంలోని స్పీకర్ల నుండి పెద్దగా సంగీతం పెడుతూ, డ్రైవర్ వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ అస్తవ్యస్తంగా నడుపుతున్నాడని కూలీలు వివరించారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలను కేంద్రం రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించింది.
ఇది కూడా చదవండి..: DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన

