అక్షరటుడే, వెబ్డెస్క్: NIA Explosives Raid | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శనివారం కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ముమ్మర సోదాలు నిర్వహించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగాయి.
NIA Explosives Raid | 19 చోట్ల సోదాలు
కేసు (RC-01/2026/NIA/KOC) దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఐఏ అధికారులు.. నిందితులతో పాటు పేలుడు పదార్థాల డీలర్లు, తయారీదారుల ఇళ్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ముగ్గురు దక్షిణాది రాష్ట్రాల్లోని మొత్తం 19 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

NIA Explosives Raid | కీలక ఆధారాలు, జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
ఈ రోజు జరిగిన విస్తృత సోదాల్లో భారీగా పేలుడు పదార్థాలతో పాటు కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిల్లో జిలెటిన్ స్టిక్స్, పలు డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు, ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాల్లోని డేటాను, పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
NIA Explosives Raid | ఆరుగురు నిందితుల అరెస్టు
ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్రమంగా తరలిస్తున్న భారీ పరిమాణంలో పేలుడు పదార్థాలను కేరళ పోలీసులు పట్టుకున్నారు. దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించడంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ.. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది.
ఇంత భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను అక్రమంగా సేకరించడం వెనుక తీవ్రమైన జాతీయ భద్రతాపరమైన ముప్పు (National Security Implications) దాగి ఉందనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఈ పేలుడు పదార్థాలను ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో ఎన్ఐఏ తదుపరి విచారణను వేగవంతం చేసింది.
Abhishek Banerjee attack | సోనార్పుర్ సెగ: మమత మేనల్లుడిపై దాడి…..


