అక్షరటుడే, వెబ్డెస్క్ : Manipur Earthquake | మణిపూర్ (Manipur)లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం చోటు చేసుకుంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) ప్రకారం, 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5:50 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం కామ్జాంగ్ (Kamjang)లో ఉంది.
భూకంపం భూ ఉపరితలం నుంచి 62 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీంతో ప్రభావం తక్కువగా ఉంది. పెద్ద నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని అధికారులు తెలిపారు. అయితే ప్రకంపనలు మోస్తరుగా ఉన్నప్పటికీ ప్రజలు నిద్రలో నుంచి లేచి బయటకు పరుగులు తీశారు.

Manipur Earthquake | మయన్మార్లో..
భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని భూకంప కేంద్రం ఉండటంతో మయన్మార్లో సైతం ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మయన్మార్లో ఉదయం 5.38 గంటలకు 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం ఈశాన్య, ఉత్తర జపాన్లో 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరిక సైతం జారీచేశారు. వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: Tamil Nadu Election | తమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

