అక్షరటుడే, వెబ్డెస్క్: MIM Leader Murder | హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలో ఏఐఎంఐఎం నాయకుడు మెహబూబ్ అలీ హత్యకు గురయ్యాడు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో గల వట్టేపల్లి ప్రాంతంలో గుంటల్ షా బాబా దర్గా సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
వట్టేపల్లిలోని గుంటల్ షా బాబా దర్గా సమీపంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో AIMIM ఏరియా అధ్యక్షుడు మెహబూబ్ అలీపై కొందరు దాడి చేశారు. ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు అలీపై కత్తులతో దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
MIM Leader Murder | మూడు బృందాల ఏర్పాటు
ఈ హత్యపై దర్యాప్తు చేయడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన పాతబస్తీలో ఆందోళన రేకెత్తించింది. అలీ హత్యతో కలిపి, ఈ ఏడాది ఇప్పటివరకు పాతబస్తీలో ఆరు హత్యలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ హత్యను MBT ప్రతినిధి అంజెద్ ఉల్లా ఖాన్ ఖండించారు. ఇది శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు.
ఇది కూడా చదవండి..: NEET PG Student Suicide | తీవ్ర విషాదం.. నీట్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య