అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Road Accident | నిజామాబాద్ జిల్లా Nizamabad రూరల్ ప్రాంతంలోని చక్రధర్నగర్ తండా లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిన్నారి కీర్తన (6) రోడ్డును దాటుతూ వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కీర్తనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.
Nizamabad Road Accident | కారు సీజ్
పోలీసుల పరిశీలనలో.. ప్రమాదానికి కారణమైన కారును ఒక డెంటల్ కాలేజీ విద్యార్థి నడిపినట్టు గుర్తించారు. కీర్తన తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు.
చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతపై పోలీసులు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నారు.


[…] Nizamabad Road Accident | వేగంగా దూసుకెళ్లిన డెంటల్… […]