అక్షరటుడే, ఇందూరు: Nizamabad RTC | నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్గా ఎస్పీజీకే మూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లాకు విచ్చేసిన ఆయనకు ఆర్టీసీ (TGSRTC) డీఆర్ఎం, డీఎంలు, ఉద్యోగులు సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని (Collector Ila Tripathi) మర్యాదపూర్వకంగా కలిశారు.
Nizamabad RTC | జిల్లాలో ఆర్టీసీ సేవలను విస్తృత పరుస్తాం..
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎం మూర్తి కార్యాలయంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపరింటెండెంట్లు, రీజియన్ కార్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొత్త బస్సు మార్గాల అవసరం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రజారవాణా సౌకర్యాల విస్తరణ, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల, విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన బస్సు సేవల కల్పన వంటి అంశాలపై చర్చించారు. జిల్లా ప్రజలకు సురక్షితమైన, సమయపాలనతో కూడిన, నాణ్యమైన రవాణా సేవలను అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కట్టుబడి ఉందన్నారు.

ఇది కూడా చదవండి: POK Protest Shootings | పీవోకేలో మరోసారి కాల్పులు.. 16 మంది మృతి
