Nizamsagar Water Release | నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలి

నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు

shashi kiran Mottala

అక్షరటుడే, కోటగిరి : Nizamsagar Water Release | నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు పోతంగల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్ సందీప్​కు వినతిపత్రం అందజేశారు.

Nizamsagar Water Release | వర్షాల్లేక వరినాట్లు..

అనంతరం మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) మాట్లాడుతూ.. కష్టపడి వరి నాట్లు వేసిన రైతులు వర్షాలు పడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బోర్లు ఎత్తిపోయి పొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలను విధిస్తూ రైతులకు ఇబ్బంది పాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నుంచి గోదావరి నది జలాలను తీసుకొచ్చి నిజాంసాగర్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు గంగాధర్ పటేల్, సంతోష్ పటేల్, గంధపు హన్మాండ్లు, మక్కయ్య, కిరణ్, అర్జున్, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Teacher Protest Telangana | ఉపాధ్యాయులపై కాంగ్రెస్​ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం..: దినేష్​ కులాచారి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *