అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Teacher Protest Telangana | విద్యనందించే ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని బీజేపీ(Nizamabad BJP) తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. విద్యారంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తపస్(TUPS) ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద చేస్తున్న ధర్నాకు ఆయన మంగళవారం సంఘీభావం తెలిపారు.
Teacher Protest Telangana | ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన దుస్థితి..
అన్నం పెట్టే రైతాంగం వర్షాలు లేక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. విద్యను అందించే ఉపాధ్యాయులు సైతం తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి రావడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దినేష్ అన్నారు. రాష్ట్రంలో సుమారు 51 శాతం పీఆర్సీ పెండింగ్లో ఉందని.. అలాగే దేశంలోనే మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఆరు డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి నేడు సీఎం అయ్యాక విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
Teacher Protest Telangana | మూసీ నది ప్రక్షాళలకు రూ.వేల కోట్లు..
మూసీ నది ప్రక్షాళనకు రూ.వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఉన్న ఆసక్తి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎందుకు లేదని దినేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.4వేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు కిషన్ రెడ్డి, మధుసూదన్ చారి, వరప్రసాద్, బద్రీనాథ్, కృష్ణవేణి, కవిత తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: లులు మాల్లో గన్ కలకలం