అక్షరటుడే, వెబ్డెస్క్: Odisha Bank Incident | ఓ వ్యక్తి తన సోదరి అస్థిపంజరంతో బ్యాంక్కు వెళ్లాడు. ఆమె చనిపోయిందనడానికి అధికారులు రుజువులు అడగటంతో సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని తీసుకెళ్లాడు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లా (Keonjhar District)లో ఈ నెల 27న చోటు చేసుకుంది.
దియానాలి గ్రామానికి (Dianali Village) చెందిన జితు ముండా సోదరి కాక్రా ముండాకు రెండు నెలల క్రితం చనిపోయింది. ఆమెకు మల్లిపాసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండేది. ఆ అకౌంట్లో రూ.19,300 డబ్బులు ఉన్నాయి. కాక్రా ముండా భర్త, పిల్లలు సైతం చనిపోయారు. దీంతో ఆమె అకౌంట్లోని డబ్బుల కోసం జితు ముండా బ్యాంక్ అధికారులను కలిశాడు. దీంతో ఖాతాదారుడు తప్పనిసరిగా హాజరు కావాలని, లేదా అతను చట్టబద్ధమైన వారసత్వ పత్రాలను సమర్పించాలని బ్యాంకు మేనేజర్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు.
Odisha Bank Incident | పత్రాలు లేకపోవడంతో..
జితు చదువుకోలేదు. అతడి వద్ద డెత్ సర్టిఫికెట్ (Death Certificate), ఇతర వారసత్వ పత్రాలు లేవు. దీంతో తన సోదరి మరణించిందని రుజువు చూపడానికి ఆమెను పాతిపెట్టిన గోతిని తవ్వాడు. మృతదేహాన్ని భుజాలపై మోసుకొని మూడు కిలోమీటర్లు ఎండలో నడుచుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనతో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు షాక్ అయ్యారు. సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పేదవాడు తన సొంత డబ్బులు తీసుకోవడం ఇంత కష్టమా అని ప్రశ్నించారు.
Odisha Bank Incident | స్పందించిన సబ్ కలెక్టర్
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, జితును సముదాయించారు. ఈ కేసును మానవతా దృక్పథంతో విచారిస్తామని, బ్యాంకు నుంచి స్పందన కోరామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ (Sub-Collector) ఉమా శంకర్ దలై మాట్లాడుతూ, ఆ గిరిజన వ్యక్తికి ప్రక్రియపరమైన అంశాలపై అవగాహన లేదన్నారు. నిరాశతో అతను ఈ పని చేశాడని చెప్పారు. అతడికి అవసరమైన పత్రాలు అందించి బ్యాంకుతో సంప్రదించి, రూ. 20వేలు అందేలా చూస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: India Defence | సైనిక బలాన్ని పెంచుతున్న భారత్.. రక్షణ రంగ వ్యయంలో నయా రికార్డ్.


[…] ఇది కూడా చదవండి..: Odisha Bank Incident | సోదరి అస్థిపంజరంతో బ్యాంక్… […]
[…] ఇది కూడా చదవండి : Odisha Bank Incident | సోదరి అస్థిపంజరంతో బ్యాంక్… […]