అక్షరటుడే, వెబ్డెస్క్ : Overseas Vidyanidhi Scheme | విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలి అనుకునే బీసీ (BC), ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్షిప్ అందిస్తోంది.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా, అందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారని వెల్లడించింది. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/పీహెచ్డీ వంటి ఉన్నత కోర్సులు అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది.
Overseas Vidyanidhi Scheme | అర్హతలు ఇవే..
ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. 35 ఏళ్లలోపు వరకు అర్హులు. గ్రాడ్యుయేషన్లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. GRE-260 లేదా GMAT-500 స్కోర్ ఉండాలి. TOEFL-60 మార్కులు, IELTS-6.0 లేదా PTE-50 మార్కులు స్కోర్ ఏదైనా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలి.
Overseas Vidyanidhi Scheme | రూ.20 లక్షల సాయం
ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక కమిటీ పరిశీలిస్తుంది. మెరిట్ జాబితా ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తోంది. ఈ పథకానికి ఎంపిక అయితే విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ప్రభుత్వం అందిస్తుంది. దీంతోపాటు విమాన, వీసా ఖర్చులను భరిస్తుంది.
దీనిని కూడా చదవండి : Delhi Model Murder | ఢిల్లీలో మోడల్ హత్య.. నిందితుడి అరెస్ట్