అక్షరటుడే, వెబ్డెస్క్: Paper Leak Punishment | నీట్ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.
పేపర్ లీకేజీ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ (PM Modi) గురువారం రాత్రి వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనను చట్టంలో చేర్చవచ్చని, అలాగే లీక్కు పాల్పడే నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Paper Leak Punishment | ప్రస్తుత శిక్షలు
ప్రస్తుతం పేపర్ లీక్ కేసులో దోషిగా తేలిన వ్యక్తులకు 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. చట్టంలో సవరణ చేసి జరిమానాను రూ. 1 కోటి వరకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. జైలు శిక్షను సైతం పదేళ్ల వరకు విధించాలని యోచిస్తోంది. కేబినెట్ ఆమోదం తర్వాత, ఈ సవరణ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పేపర్ లీక్ కేసులలో శుక్రవారం మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో ప్రకటనలో హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: NEET Student Protests | ప్రధాని మోదీ మన్ కీ బాత్ మానుకోవాలి: మల్లికార్జున ఖర్గే