అక్షరటుడే, కామారెడ్డి: Petrol Shortage | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. రాష్ట్రంలో కూడా ఎక్కడా పెట్రోల్ (petrol bunks), డీజిల్ కొరత లేదు. అయితే అనూహ్యంగా సోమవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
Petrol Shortage | సాయంత్రం నుంచి నోస్టాక్..
పట్టణంలో (kamareddy news) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి కొరత లేకుండా కొనసాగిన పెట్రోల్ బంకులు సాయంత్రం నో స్టాక్ అంటూ మూసివేశారు. దాంతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం కామారెడ్డి పట్టణం మొత్తం చక్కర్లు కొట్టారు. నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న ఒకే ఒక్క పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ ఉండడంతో వాహనదారులు క్యూ కట్టారు. మరికొందరు మళ్లీ పెట్రోల్ కొరత ఎక్కడ వస్తుందోనని వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకుని బాటిల్స్లో సైతం పెట్రోల్ వేసుకుని వెళ్లారు. పెట్రోల్ కొరతకు కారణాలను బంక్ సిబ్బంది వద్ద ఆరా తీయగా నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు ఉండడంతో పెట్రోల్, డీజిల్ కోసం డీడీలు చెల్లించలేదని తెలిసింది. వరుసగా రెండు రోజులు బ్యాంకులు సెలవు కావడమే పెట్రోల్, డీజిల్ కొరతకు కారణమని సిబ్బంది పేర్కొన్నారు. నేడు బంక్ల యాజమాన్యాలు డీడీలు చెల్లించేందుకు క్యూ కట్టారని, నేటి రాత్రి వరకు పెట్రోల్, డీజిల్ చెల్లించే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: KTR on Kavitha Party | కవిత పార్టీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు


[…] […]